దాల్మియా భారత్లో 8.5% వాటా కొన్న కేకేఆర్ | KKR Mauritius Cement Investments buys 8.5% in Dalmia Bharat | Sakshi
Sakshi News home page

దాల్మియా భారత్లో 8.5% వాటా కొన్న కేకేఆర్

Mar 15 2016 12:30 AM | Updated on Sep 3 2017 7:44 PM

దాల్మియా భారత్లో 8.5% వాటా కొన్న కేకేఆర్

దాల్మియా భారత్లో 8.5% వాటా కొన్న కేకేఆర్

దాల్మియా భారత్ కంపెనీలో 8.5 శాతం వాటాను కేకేఆర్ మారిషస్ సిమెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనుగోలు చేసింది.

న్యూఢిల్లీ: దాల్మియా భారత్ కంపెనీలో 8.5 శాతం వాటాను కేకేఆర్ మారిషస్ సిమెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనుగోలు చేసింది. ఇంతకు ముందు దాల్మియా భారత్ కంపెనీ తన అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్(డీసీబీఎల్)లో 15 శాతం వాటాను రూ.1,218 కోట్లకు కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం పొందింది. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ నుంచి ఈ వాటాను దాల్మియా భారత్(డీబీఎల్)కొనుగోలు చేసింది. ఈ వాటా విక్రయం వల్ల కేకేఆర్ సంస్థకు 2.4 రెట్లు రాబడి వచ్చింది. 2010 సెప్టెంబర్‌లో ఈ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈ వాటాను రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీసీబీఎల్‌లో కేకేఆర్‌కు ఉన్న 15 శాతం వాటాను కొనుగోలు చేయడానికి, అలాగే డీబీఎల్‌లో 8.5% వాటా కేకేఆర్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని దాల్మియా భారత గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement