ఇండిగో సమ్మర్ ఆఫర్ సేల్
రూ.999కే టికెట్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3–డే సమ్మర్ సేల్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్ వర్తిస్తుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ముంబై–హైదరాబాద్, హైదరాబాద్–దుబాయ్, చెన్నై– కువైట్, ఢిల్లీ–కౌలాలంపూర్, బెంగళూరు–మాల్దీవ్ రూట్లలో ఆఫర్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.
‘వేసవి సెలవులు మొదలవడంతో ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించాం. మే16 వరకు జరిగే బుకింగ్స్పై ఆఫర్ వర్తిస్తుంది’ అని సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ పేర్కొన్నారు. ప్రీ–పెయిడ్ అధిక బ్యాగేజీపై 30% వరకు డిస్కౌంట్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.