అరబిందో విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

Green Signal For Aurobindo Expansion Unit In Andhra Pradesh - Sakshi

హైదరాబాద్‌: అరబిందో ఫార్మా విస్తరణ ప్రణాళికకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.250 కోట్ల మూలధన వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఉత్పత్తి కేంద్రానికి సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 583.31 టీపీఎం (ఒక నెల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం టన్నులు) భారీ ఔషధాలు, ఇంటర్మీడియట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ అనంతరం ఇది 1,518.3 టీపీఎంకు చేరుతుందని వివరించింది. ఈ యూనిట్‌లో 8.85 మెగావాట్ల క్యాపిటివ్‌ పవర్‌ ప్లాంటును సైతం నెలకొల్పనుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యల కోసం రూ.32.77 కోట్లుగా అంచనావేసింది. ప్రాజెక్ట్‌ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 120 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top