ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Flipkart Mobiles Bonanza Sale starts February 19 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' ను ప్రకటించింది . అయిదు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు నిర్వహించే సేల్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా  షావోమీ, రియల్‌మీ,ఆసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి.  అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌,  ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై లాంటి  ఆఫర్లు కూడా ఉన్నాయి.

పోకో ఎఫ్‌‌1 6జీబీ, 64జీబీ స్టోరేజ్‌  రూ.17,999 లకే అందిస్తోంది. ఎంఆర్‌పీ రూ.19,999. దీంతోపాటు  రూ.3,000  ఎక్స్ఛంజ్‌ఆఫర్‌ కూడా ఉంది. 
పోకో ఎఫ్‌‌1 6జీబీ,128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.20,999కు లభ్యం 
రియల్‌ మి 2 ప్రొ 4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.11,990 కు లభిస్తోంది.   ప్రస్తుత ధర- రూ.12,990
రెడ్‌మి నోట్‌ 6 ప్రొ 4జీబీ, 64జబీ స్టోరేజ్‌  : రూ.12,999 లభ్యం.  ప్రస్తుత ధర- రూ.13,999

ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ మాక్స్‌ ప్రొ ఎం1, 3జీబీ, 32జీబీ స్టోరేజ్‌ 
ఆసుస్‌ జెన్‌ఫోన్‌  మాక్స్‌ప్రొ ఎం2 4జీబీ, 64జీబీ  రూ.11,999కే లభిస్తోంది. ప్రస్తుత ధర- రూ.14,999, 

 

హానర్‌ 9ఎన్‌ 4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ రూ. రూ.8,499  లభ్యం. 
వివో వి9 ప్రొ 4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ రూ.12,490. 2వేల రూపాయలు డిస్కౌంట్‌.

 

మోటరోలా వన్‌పవర్‌ 4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ రూ.13,999 లభ్యం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top