స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్ | Finance ministry to notify Swachh Bharat cess on services later | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్

May 21 2015 12:44 AM | Updated on Sep 3 2017 2:23 AM

స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్

స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్

వివిధ సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సును విధించే అంశాన్ని తర్వాత నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ: వివిధ సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సును విధించే అంశాన్ని తర్వాత నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, జూన్ 1 నుంచి 14 శాతం సేవల పన్ను అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సెస్సు ద్వారా వసూలైన మొత్తాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

సర్వీస్ ట్యాక్స్‌ను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడంతో పాటు అన్ని లేదా కొన్ని ఎంపిక చేసిన సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త సర్వీస్ ట్యాక్స్ రేటుతో రెస్టారెంట్లలో తినడం మొదలుకుని బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు, విమాన ప్రయాణాల దాకా చాలా మటుకు సేవలు మరింత భారంగా మారనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement