హడ్కో ఐపీఓ...మే 8 నుంచి | Everstone-backed S Chand's IPO sails through on second day | Sakshi
Sakshi News home page

హడ్కో ఐపీఓ...మే 8 నుంచి

Apr 28 2017 12:24 AM | Updated on Sep 5 2017 9:50 AM

హడ్కో ఐపీఓ...మే 8 నుంచి

హడ్కో ఐపీఓ...మే 8 నుంచి

కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పీఎస్‌యూ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతోంది.

ధరల శ్రేణి రూ.56–60
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పీఎస్‌యూ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే నెల 11న ముగిసే ఈ ఐపీఓ ద్వారా హడ్కో రూ.1,200 కోట్లు సమీకరించనుంది. 2012 తర్వాత ఐపీఓకు వస్తున్న తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. షేర్‌ ముఖ విలువ రూ.10 అని, ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.56–60గా నిర్ణయించామని  హడ్కో సీఎండీ ఎం. రవికాంత్‌ చెప్పారు.. ఈ ఐపీఓలో భాగంగా 10.19 శాతం వాటాను విక్రయించనున్నామని పేర్కొన్నారు.

 ఈ ఐపీఓలో భాగంగా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నామని, వీటిల్లో 20.01 కోట్ల షేర్లను ఇన్వెస్టర్లకు, 38.68 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించామని వివరించారు. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, నొముర, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి.

 రిటైల్‌ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌ లభించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ పట్టణ మౌలిక, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు రుణాలందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సగానికి పైగా ఐపీఓల ద్వారానే సమీకరించాలనేది ప్రభుత్వం ఆలోచన.

Advertisement
 
Advertisement
Advertisement