ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం | BSNL records six-fold jump in operating profit at Rs 3855 cr in FY16 | Sakshi
Sakshi News home page

ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం

Nov 30 2016 12:56 AM | Updated on Sep 4 2017 9:27 PM

ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం

ఆరింతలు పెరిగిన బీఎస్ఎన్ఎల్ లాభం

ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆరింతలు వృద్ధి చెందింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో ఆరింతలు వృద్ధి చెందింది. అంతకు ముందు ఏడాదిలో రూ.672 కోట్లు ఉండగా... 2015-16లో రూ.3,855 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా గత ఐదేళ్లలోనే అత్యధిక స్థారుులో నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం 2016 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సంలో 4.4% పెరిగి రూ.28,449 కోట్లకు చేరినట్టు బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు వెల్లడించారుు. 2009-10 తర్వాత ఈ స్థారుు ఆదాయం రావడం ఇదే మొదటిసారి.

ఈ మేరకు ఆర్థిక ఫలితాల నివేదిక గత వారం జరిగిన ఏజీఎం ముందుకు వచ్చింది. 2015-16 సంవత్సరంలో కొత్తగా 25వేల టవర్లను ఏర్పాటు చేయడం వినియోగదారుల పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా మొబైల్ విభాగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు అధిక ఆదాయం లభించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో వృద్ధి 2 శాతంగా ఉండగా, మొబైల్ విభాగంలో ఇది 8 శాతంగా నమోదైంది. ఒకవైపు ఆదాయం పెరగడం, మరోవైపు వ్యయాలు, వేతనాలు, పరిపాలన, ఇతర ప్రయోజనాల కుదింపు ఫలితంగా పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందస్తు లాభం (ఇబిటా) రూ.3,879 కోట్లుగా. మొత్తం ఆదాయంలో ఇబిటా 11.71 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement