ఆగస్టు 23న బంధన్ బ్యాంక్ ప్రారంభం

ఆగస్టు 23న బంధన్ బ్యాంక్ ప్రారంభం


కోల్‌కతా : బంధన్ బ్యాంక్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 23వ తేదీన ప్రారంభించనున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రారంభించిన మూడేళ్లకు ఈ బ్యాంక్ 2018లో ఐపీఓకు వెళ్లాలని వ్యూహ రచన చేస్తోంది. బ్యాంక్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈఓ ఎండీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రారంభంలోనే బ్యాంక్ దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 630 బ్రాంచీలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వీటిలో పశ్చిమబెంగాల్‌లోనే 247 ఉంటాయి. ప్రారంభంలో బ్యాంక్ 250 ఏటీఎంలను ఆవిష్కరిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top