కదం తొక్కిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
ధర్నాలు, ర్యాలీలతో దద్దరిల్లిన మండల కేంద్రాలు
నరసాపురంలో గేదెలతో వినూత్న ర్యాలీ
తహసిల్దార్లకు వినతిపత్రాలు అందజేత
ఏలూరు (ఆర్ఆర్ పేట) :ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రాలను తహసిల్దార్లకు సమర్పించి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నరసాపురం, మొగల్తూరులలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నరసాపురం మండలంలో ప్రజలకే కాకుండా పశువులకూ తాగునీరు అందటం లేదని పేర్కొంటూ గేదెలతో ప్రదర్శన చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరిపి
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయగూడెంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. డిమాం డ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్కు అందచేశారు. జీలుగుమిల్లిలో పార్టీ మండల కన్వీనర్ గూడవల్లి శ్రీని వాసరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఆచంటలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్, మాజీ జెడ్పీటీసీ ముప్పాళ వెంకటేశ్వరరావు, వైట్ల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. పెనుమంట్రలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెన్మెత్స రామరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి విశ్వనాథరెడ్డి భారీ ప్రదర్శన నిర్వహిం చారు. దెందులూరు, పెదవేగి తహసిల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మెట్లపల్లి సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ నాయకత్వంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్లలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చింతలపూడి మండలంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేసి తహసిల్దార్కు వినతిపత్రం సమర్పిం చారు. రు. కొవ్వూరులో పార్టీ నాయకులు ఎనికే వీర్రాజు, సుంకర సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆకివీడులో పార్టీ సీనియర్ నాయకుడు కేశిరెడ్డి మురళి ఆధ్వర్యంలో తహసిల్దార్కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం కూడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నారు.
ప్రజా సమస్యలపై సమరం
Published Tue, May 5 2015 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement