ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర | ys jagan prajasakalpayaltra in chittoor district from december 26 | Sakshi
Sakshi News home page

ఈ నెల 26 నుంచి చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర

Dec 17 2017 6:35 PM | Updated on Aug 13 2018 3:11 PM

ys jagan prajasakalpayaltra in chittoor district from december 26 - Sakshi

సాక్షి, చిత్తూరు:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 26 నుంచి  చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 9 నియోజకవర్గాల మీదుగా  యాత్ర సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, మరుగుదొడ్డలోను అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.

కడప జిల్లాలో ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మొత్తం 519 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేపట్టారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన 37వ రోజు  ప్రజాసంకల్పయాత్రను అనంతపురం జిల్లాలోని దర్శినమలలో ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement