
వన్నప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది.
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. ఉదయం ఉరవకొండ నియోజక వర్గంలో యాత్రను ప్రారంభించారు. పట్టణంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు అందెల వన్నప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చేరుకుంటారు.
అక్కడ ఆత్మహత్య పాల్పడిన రైతు ఓబులేసు (అలియాస్ పెన్నోబిలేసు) కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా వెంకటాంపల్లి పెద్దతండాకు వెళ్లి రైతు కొర్ర గోవింద నాయక్ (అలియాస్ నాగు నాయక్) కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర రాయదుర్గం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.