జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈమేరకు విచారించిన ప్రత్యేక కోర్టు ముంబై, భువనేశ్వర్ నగరాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది.కాగా, చెన్నై పిటీషన్ను విచారించిన కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహనరెడ్డి ముంబై, చెన్నై,భువనేశ్వర్ లు వెళ్లేందుకు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు పిటీషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ పిటిషన్ దాఖలు చేశారు.