అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండో విడత రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ నుంచి ఆయన యాత్ర ప్రారంభించారు.
కాదలూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం అదే గ్రామంలో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాగా నేటితో రెండో విడత భరోసా యాత్ర ముగియనుంది.