రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: వైఎస్‌ జగన్‌

YS Jagan Extends Republic Day Greetings - Sakshi

రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రతిపక్షనేత

సాక్షి, హైద‌రాబాద్‌:  రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిప‌క్షనేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు, ప్రపంవ్యాప్తంగా ఉన్న భార‌తీయుల‌కు ఆయన 70వ గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

ప్రపంచంలోనే అత్యున్నతమైన, అత్యుత్తమైన రాజ్యాంగం అమలులోకి వచ్చి 69 సంవత్సరాలు అయిందని,  ప్రతి పౌరుడికీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే మన ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుతున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top