239వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం  | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 18 2018 9:23 AM

YS Jagan 239th Day Prajasankalpayatra Begins - Sakshi

సాక్షి, నర్సీపట్నం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 239వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం మెట్టపాలెం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి నర్సీపట్నంలోని బెన్నవరం మీదుగా నర్సీపట్నం టౌన్, కృష్ణాపురం, దుగ్ధ క్రాస్‌ రోడ్డు, బయ్యపురెడ్డి పాలెం మీదుగా నేటి పాదయాత్ర కొనసాగనుంది. బలిఘట్టం మీదుగా పాదయాత్ర చేసిన తర్వాత నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

వైఎస్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 

         

Advertisement
Advertisement