క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు | Youngster missing in Quarry pit | Sakshi
Sakshi News home page

క్వారీగుంతలో పడి యువకుడు గల్లంతు

Jul 6 2015 5:58 PM | Updated on Sep 3 2017 5:01 AM

క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు.

గంగాధర్‌నెల్లూరు (చిత్తూరు జిల్లా) : క్వారీగుంతలో ఈతకెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రానికి చెందిన చంద్ర(21) అనే యువకుడు స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీ గుంతకు ఈతకెళ్లాడు.

ఈ క్రమంలోనే క్వారీ గుంతలో దూకిన చంద్ర గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు పోలీసులకు తెలిపారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement