ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి | women died in a tractor accident | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

Feb 15 2015 3:37 PM | Updated on Sep 2 2017 9:23 PM

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు...కళ్లిపాలెం గ్రామానికి చెందిన దాసరి భిక్షాలు, ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ ఆదివారం ఉదయం గుడికి వెళ్లి... తిరిగి కళ్లిపాలెంకు వెళుతుండగా... రేపల్లె రోడ్డులో ప్రజ్నం వద్ద ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా... భిక్షాలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

(నిజాంపట్నం)

Advertisement
 
Advertisement
Advertisement