రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం | will fight with government for loan waiver, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం

Aug 10 2014 1:24 AM | Updated on Jul 25 2018 4:09 PM

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం - Sakshi

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం

రుణమాఫీ అమలు జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు

నెల్లూరు పర్యటనలో రైతులకు జగన్ భరోసా

నెల్లూరు: రుణమాఫీ అమలు జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు. ఆయన శనివారం నెల్లూరులో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, నెల్లూరుపాలెం, సంగంలలో పార్టీశ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు రుణమాఫీ హామీ తుంగలోతొక్కి రైతులను నట్టేట ముంచారని రైతులు జగన్ దృష్టికితెచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement