విజయనగరం కంటోన్మెంట్: జూన్ నెల వచ్చిందంటే ఏటా తహశీల్దార్, మీసేవా కేంద్రాల చుట్టూ విద్యార్థులు తిరుగాల్సిన ఇబ్బందులు ఇక తప్పనున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రం స్థానంలో ఇక తెల్లకార్డునే అనుమతించి ధ్రువీకరణ చేసుకోవాలని భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు కూడా పంట, భూ రుణాలపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కోరవద్దని స్టేట్లెవెల్ బ్యాంకర్ల కమిటీ ద్వారా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. వారికి కూడా ఆదాయ ధ్రు వీకరణ పత్రంగా తెల్ల రేషన్ కార్డును గుర్తించాలని సీసీఎల్ఏ జీఓ విడుదల చేసింది.
తక్షణం ఈ ఆదేశాలను ఆయా తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు అమలు చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి నాలుగేళ్ల కాలపరిమితితో ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సూచించారు. ఇందుకు తగిన కొత్త ఫార్మాట్ను విడుదల చేశారు. ఈ ఫార్మాట్ లో దరఖాస్తు దారుని ఆధార్నంబర్ కాలమ్తో సహా కొత్తగా రూపొందించారు. అదేవిధంగా అధికాదాయ వర్గా ల వారికి జీవిత కాల ధ్రువీకరణను ఇస్తారు. జీవితాంతం ఇదే ధ్రువీకరణ వర్తిస్తుందని జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ఆదాయ ధ్రు వీకరణ పత్రం అవసరం లేదని జీఓలో పొందుపరిచారు.
అనర్హుల సంగతేంటి?
ఆదాయ ధ్రువీకరణ పత్రంగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం బాగానే ఉంది కానీ, ఈ విధానాన్ని కొందరు అధికాదాయ వర్గాల వారు దుర్వినియోగం చేసుకుని అందరిలానే తమకూ బీపీఎల్ ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ వేలాది మంది అధికాదాయ వర్గాల వారికి తెల్ల రేషన్ కార్డు ఉంది. పెద్ద పెద్ద భవంతులను అద్దెలకు ఇచ్చే వారితో పాటు నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేవారు కూడా తెల్ల కార్డును పొంది ఉన్నారు.
అయితే ఈ తరహా ప్రయోజనాలు కేవలం బీపీఎల్ కుటుంబాలకే కలిగించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. జిల్లాలో అన్నపూర్ణ, ఏఏవై కార్డులతో పాటు 6,42,490 బీపీఎల్ రేషన్ కార్డులున్నాయి. ఇందులో దాదాపు 50వేలకు పైగా సంపన్నులకు తెల్ల రేషన్ కార్డులున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరితో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తల్లి దండ్రులకు కూడా తెల్ల రేషన్ కార్డులే ఉన్నాయి. మరి తెల్ల రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తిస్తే ఇక ఇటువం టి వారికి కూడా వర్తిస్తుందని చెబుతున్నారు.
తెల్లకార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం
Published Tue, Jun 9 2015 11:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement