చేనేత కార్మికుడి ఆత్మహత్య | weaver commits suicide in ananthpur distirict | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుడి ఆత్మహత్య

Apr 12 2016 11:47 AM | Updated on Nov 6 2018 7:56 PM

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీలో శంకర ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీలో శంకర ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలు అప్పు ఉన్నట్లు వారు చెప్పారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. సంఘటనా స్థలానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement