పల్లెల గొంతులు ఎండుతున్నయి
రూ. 172 కోట్లు కరిగిపోయినా
కొలిక్కిరాని పనులు
ఇంకా రూ. వంద కోట్లు వస్తేనే ప్రయోజనం
అరకొరగా నిధులు విదిలిస్తున్న సర్కారు
గడువుల మీద గడువులు పెడుతున్న అధికారులు
నత్తనడకన సాగుతున్న గోదావరి జలాల తాగునీటి పథకం
గ్రామాలలో అప్పుడే మొదలైన వేసవి కష్టాలు
‘ఎంతెంత దూరం...కొంత కొంత దూరం’ అన్నట్టుగా ఉంది కామారెడ్డి తాగునీటి పథకం పనుల తీరు. ఈ పథకం పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సా..గు..తు..న్నా..యి. తెలంగాణలోనే భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి జలాల తాగునీటి పథకం పనులపై అధికార పార్టీ నేతలు గొప్పలకు పోతున్నా అవి కొలిక్కిరావడం లేదు. ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు.
కామారెడ్డి, న్యూస్లైన్:
భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిన పరిస్థితులలో, కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చే ఈ పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రూ. 140 కోట్లు మంజూరు చేశారు. ప్రజారోగ్య శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. 2008 మార్చి ఒకటిన కామారెడ్డిలో పనులకు మహానేత శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరేళ్లవుతున్నా పనులు ఇంకా ఓ కొలిక్కి లేదు. నెలా,రెండు నెలలలో పనులు పూర్తవుతాయని, కామారెడ్డి పట్టణానికి మొదటగా నీళ్లందిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.
కొద్ది దూరమే
ఇప్పటిదాక మల్లన్నగుట్ట వరకు మాత్రమే ట్రయల్న్ ్రపూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైను పనులు పూర్తి కాలేదు. మరోవైపు ఉన్న నిధులన్నీ అయిపోయాయి. జలాల్పూర్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ను అర్గుల్కు, అక్కడి నుంచి ఇందల్వాయి మీదుగా మల్లన్నగుట్ట వరకు పంపింగ్ చేయా ల్సి ఉంటుంది. కామారెడ్డి పట్టణంతోపాటు 219 గ్రామాలకు నీటిని అందించాలి. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, తాడ్వా యి, సదాశివనగర్, ధర్పల్లి, డిచ్పల్లి మండలాలలోని గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు.
తొలిదశ పూర్తి
తొలిదశలో రూ.140 కోట్లతో మల్లన్నగుట్ట వరకు చేపట్టిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గ్రామాలకు నీటిని అందించాలంటే మరో రూ. 60 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. అది ఇప్పుడు రూ. 120 కోట్లకు చేరుకుంది. ఇటీవల రూ. 20 కోట్లు మంజూరు కావడంతో టెండర్లు నిర్వహించారు. మరో రూ. వంద కోట్లు వస్తేగాని అన్ని గ్రామాలకు నీటిని అందించలేని పరిస్థితి. మూడు నెలల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మల్లన్నగుట్ట వద్ద ఈ పథకం పనులను పరిశీలించిన సందర్భంలో రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు రాలేదు. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి నీటిని అందించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ ద్వారా రూ. 12 కోట్లు మంజూరు చేశారు. పట్టణంలో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణకు రూ. 20 కోట్లు మంజూరు చే శారు. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి పట్టణంలోని డిగ్రీ కాలేజీ వరకు పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడంతో పట్టణానికి నీరందించ లేకపోతున్నారు. ఇటీవల కలెక్టర్ ప్రద్యుమ్న ఈ పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. మార్చి మొదటి వారంలోగా కామారెడ్డి పట్టణానికి నీటిని అందించే విధంగా పనులను వేగిరం చేయాలని ఆదేశించారని సమాచారం. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కింద పైపులైన్లు వేయడంలో తలెత్తిన ఇబ్బం దులతోనే ఆలస్యమయ్యాయని పబ్లిక్హెల్త్ అధికారులు అంటున్నారు.
పట్టణానికి పొంచి ఉన్న ముప్పు
ఏటా మార్చి మొదటి వారం వచ్చేసరికి కామారెడ్డిలో బోర్లు వట్టిపోవడం ద్వారా నీటి కష్టాలు తలెత్తుతుం టాయి. ఈసారి భారీ వర్షాలు కురిసినప్పటికీ పట్ట ణంలో మాత్రం నీటికి ఇబ్బందులు త ప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి మల్లన్నగుట్ట వద్ద నుంచి పట్టణంలోని నీటి ట్యాంకులకు ఎక్కిస్తే గాని వచ్చే నెలలో నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. పైపులైన్ల విస్తరణ పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ ట్రయల్న్ ్రనిర్వహిస్తోంది. మల్లన్నగుట్ట వద్ద నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించిన తరువాతనే పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది.
గలగలా గోదారి...దాహం తీరే దారేది?
Published Tue, Feb 4 2014 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement