సూర్యాపేట మున్సిపాలిటీ / సూర్యాపేటటౌన్, న్యూస్లైన్
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న అన్నదాతపై కేంద్రప్రభుత్వం భారం మోపింది. పం టల సాగుకు అవసరమైన యూరియా ధరను పెంచేసింది. యూరియా టన్నుకు *350 పెంచుతూ ఇటీవల జరిగిన కేంద్రమంత్రి వర్గసమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.2.89 కోట్ల అదనపు భారం పడనుంది. యూరియా ధర పెరగడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నకారు రైతులు 2.82 లక్షల మంది, సన్నకారు రైతులు 1.45లక్షల మంది, పెద్ద రైతులు 70వేల మంది ఉన్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీసీజన్లకు కలిపి లక్షా 27 వేల మెట్రిక్ టన్నుల యూరి యాను రైతులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో యూరియా ధర టన్నుకు రూ.5684 ఉండేది. కేంద్రప్రభుత్వం దీనికి రూ.350 అదనంగా పెంచింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని రైతులపై రూ. 2.89 కోట్ల అదనపు భారం పడనుంది.
50 కిలోల బస్తాకు అదనంగా రూ17.50
ప్రస్తుతం నీమ్కోటెడ్ యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298, నాగార్జున యూరియా రూ. 283.85, క్రిబ్కో రూ. 284కి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధరతో ఒక్కో యూరియా బస్తాపై రూ. 17.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇక నుంచి నీమ్కోటెడ్ యూరియా బస్తాకు రూ. 315.50 చెల్లించాలి. రిటైల్ వ్యాపారులు రవాణా, హమాలీ చార్జీలను కలుపుకొని విక్రయించనున్నందున ఈ ధర ఇంకా పెరగనుంది. ఇక ప్రయివేటు వర్తకుల ధరలు చెప్పనవరం లేదు.
ఆందోళనలో రైతులు
యారియా ధరను పెంచడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తమ నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో లోవోల్టేజీ, విద్యుత్ కోతలు, అకాల వర్షాలతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాక, కొద్దిపాటి పంటకు మద్దతు ధర లభించక రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. రబీలోనైనా ఎక్కువ దిగుబడులు వచ్చి అప్పులు తీర్చవచ్చనుకుంటున్న రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. యూరియా ధర పెంచి భారం మోపిందని అన్నదాతలు మండిపడుతున్నారు.
దురదృష్టకరం
పెరిగిన విత్తనా లు, ఎరవులు, కూలీల ధరలతో రైతులు అప్పు ల్లో కూరుకుపోతుంటే యూరియా ధర పెంచడం దురదృష్టకరం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం సబ్సిడీలిచ్చి రైతులను ప్రోత్సహించాలి. రై తులపై భారం మోపితే వ్యవసాయం ముందుకు సాగదు.
- ఏరెడ్ల జగదీశ్వర్రెడ్డి, రైతు
యూరియా.. భారమయా
Published Fri, Mar 7 2014 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement