శబరి నదిలో ఇద్దరు గల్లంతు | two persons drown in shabari river in rajamundry | Sakshi
Sakshi News home page

శబరి నదిలో ఇద్దరు గల్లంతు

Oct 11 2015 5:42 PM | Updated on Sep 3 2017 10:47 AM

తూర్పుగోదావరి జిల్లా చింతూరులో శబరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు ఆదివారం గల్లంతయ్యారు.

చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరులో శబరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు ఆదివారం గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన షేక్ సలార్ (40), పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన షేక్ ముల్లా (18) చింతూరులో బంధువుల వివాహానికి వచ్చారు.

ఆదివారం చింతూరులోనే ఉన్న శబరి నదిలో స్నానానికి దిగగా కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement