రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతి | Two dead and One injured in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతి

Dec 12 2015 8:07 PM | Updated on Aug 25 2018 6:06 PM

రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజుపాలెం (గుంటూరు) : రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోట నాగరాజు తన ఇద్దరు కుమారులతో కలిసి బావి వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. దీంతో నాగరాజు(30)తో పాటు ఆయన కుమారుడు అనిల్(4) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement