చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ట్రయల్ రన్


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే శనివారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో  నగరంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు గంటలకు పైగా నగరంలోని ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్ కు నిలిచిపోయింది.


 


ప్రకాశం బ్యారేజీపై వారధిపై కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు విఘాతం కలగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరం అష్టదిగ్బంధంనంగా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top