'మమ్మల్ని టార్గెట్ చేయడానికే.. సునీతకు మంత్రి పదవి ఇచ్చారు' | topudurthi prakash reddy takes on chandra babu | Sakshi
Sakshi News home page

'మమ్మల్ని టార్గెట్ చేయడానికే.. సునీతకు మంత్రి పదవి ఇచ్చారు'

May 3 2015 4:48 PM | Updated on Aug 21 2018 7:39 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడానికే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారని ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేయడానికే పరిటాల సునీతకు మంత్రి పదవి ఇచ్చారని ఆ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కీలక నేతలను హతమారుస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

రాప్తాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ఇటీవల వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement