నేడు పాఠశాలలు పనిచేయాలి | Today, work on schools | Sakshi
Sakshi News home page

నేడు పాఠశాలలు పనిచేయాలి

Mar 12 2016 2:00 AM | Updated on Sep 3 2017 7:30 PM

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయాలని డీఈవో నాగేశ్వరరావు ఆదే శించారు.

చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయాలని డీఈవో నాగేశ్వరరావు ఆదే శించారు. గత ఏడాది జిల్లాలో కురిసిన  వర్షాల కారణంగా ఇచ్చిన సెలవులకు ప్రత్యామ్నాయంగా ఈ నెలలో రెండో శనివారాన్ని పని దినంగా పాఠశాలలు నిర్వహించాలని తెలిపారు. కాగా, ఈ విషయాన్ని  జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలకు శుక్రవారం సాయంత్రం పాఠశాల సమయం పూర్తయ్యేలోగా సందేశాల రూపంలో అందజేయాల్సి ఉంటుంది.

అయితే  ఆ విషయాన్ని శుక్రవారం రాత్రి 7 గంటలకు తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దాదాపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు శనివారం సెలవు దినమని బాధ్యులు ప్రకటించారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో శనివారం పాఠశాలలను నిర్వహించినా చాలా మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం ఖాయమని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement