
నేడు సీఎం చంద్రబాబు రాక
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సిద్థార్థ్జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సిద్థార్థ్జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి బయల్దేరి 3 గంటలకు మహతి ఆడిటోరియంలో జరిగే ఏపీ, జేఏసీ ఉద్యోగుల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు వెళ్తారని కలెక్టర్ తెలిపారు.