ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Roundup Sep 14th Nirmala Sitharaman press conference highlights | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 14 2019 8:08 PM | Updated on Sep 14 2019 8:10 PM

Today Telugu News Roundup Sep 14th Nirmala Sitharaman press conference highlights - Sakshi

చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement