ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Dec 4th KTR fires on Central Government - Sakshi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచినట్లు  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించారు.  అలాగే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ జిల్లా వాసుల చిరకాల స్వప్నం అయిన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇకపోతే, దిశ ఘటనపై  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం  చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top