నేటి ముఖ్యాంశాలు

Today Major Events On June 19th - Sakshi

జాతీయం :
నేడు సా.5 గంటలకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశం
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను వివరించనున్న ప్రధాని మోదీ
అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్

నేడు ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
ఏపీ- 4, గుజరాత్- 4, మధ్యప్రదేశ్- 3, జార్ఖండ్- 2, మణిపూర్- 1
మేఘాలయలో ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు
ఉ.9 నుంచి సా.4 వరకు పోలింగ్.. సా.5 నుంచి ఓట్ల లెక్కింపు

ఢిల్లీ: సుప్రీంకోర్టుకు నేటి నుంచి జులై 5 వరకు వేసవి సెలవులు
జులై 6న సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ :‌
తాడేపల్లి: నేడు టూరిజం కంట్రోల్‌ రూమ్‌లు ప్రారంభించనున్న సీఎం జగన్‌
నదీతీర పర్యాటక ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన..
9 కంట్రోల్‌ రూమ్‌లను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
కోస్తాంధ్రలో చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు
నేడు, రేపు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తాడేపల్లి: నేడు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
వైఎస్ఆర్‌సీపీ నుంచి బరిలో నలుగురు, టీడీపీ నుంచి ఒకరు
వైఎస్ఆర్‌సీపీ తరపున బరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని
టీడీపీ తరపున బరిలో వర్ల రామయ్య 

తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్యను పెంచిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 10 వేల మందికి దర్శనం
నేటి నుంచి అదనంగా శ్రీవారిని దర్శించుకోనున్న 3వేల మంది భక్తులు
నేటి నుంచి ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శనం టికెట్లు

తెలంగాణ :
హైదరాబాద్ : నేడు పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్న హోంమంత్రి మహమూద్ అలీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top