తిరుపతికి భూకంప ప్రమాదమేమీ లేదు | Tirupati has no earthquake threat | Sakshi
Sakshi News home page

తిరుపతికి భూకంప ప్రమాదమేమీ లేదు

Sep 19 2017 3:25 AM | Updated on Sep 19 2017 4:44 PM

తిరుపతి, తిరుమల ప్రాంతం సేఫ్‌ జోన్‌లో ఉందని, భూకంపాలు వచ్చే ప్రమాదమేమీ లేదని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎ స్వీయూ) నిపుణులు వెల్లడించారు.

ఎస్వీయూ నిపుణుల వెల్లడి
 
యూనివర్సిటీ క్యాంపస్‌: తిరుపతి, తిరుమల ప్రాంతం సేఫ్‌ జోన్‌లో ఉందని, భూకంపాలు వచ్చే ప్రమాదమేమీ లేదని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎ స్వీయూ) నిపుణులు వెల్లడించారు. ఎస్వీ యూ జాగ్రఫీ విభాగానికి చెందిన అసి స్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎం.రెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలు, జ మ్మూ కశ్మీర్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం ఉందని, తిరుపతికి ఆ ప్రమాదం లేద న్నారు. తిరుపతిలో భూకంపం సంభవిం చే ప్రమాదం ఉందని ఐఐటీ రూర్కీ విద్యార్థుల పరిశోధనలో తేలినట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు.

ఐఐటీ రూర్కీ విద్యార్థులు పేర్కొన్నట్టు భూకంపం వచ్చే సూచనలకు సంబంధించిన సమా చారాన్ని వెంటనే నిర్ధారించలేమని, దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లోని భూమి పొరల్లో ఉన్న రాతిపలక ఒకే పలకగా ఉండడం వల్ల భూకంపం వచ్చే అవకాశాలు తక్కువే అన్నారు. ఐఐటీ విద్యార్థులు తెలిపినట్టు తమిళనాడులో భూకంపం వస్తే తిరుపతిలో స్వల్ప కదలికలు ఉండవచ్చని, అయితే అవి ప్రమాదకరం కాదన్నారు. భూకంపం వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు. కాగా, భూమి లోపల టెక్టోనిక్‌ పలకల నిరంతర కదలిక వల్ల దక్షిణాదిలో విపత్తు సంభవించే ప్రమాదం ఉందని ఐఐటీ రూర్కీ విద్యార్థులు హెచ్చరించారు. తమిళనాడులోని పాబర్, తరంగం బాడి ప్రాంతాల్లో టెక్టోనిక్‌ ప్లేట్లు ఢీ కొనడం వల్ల భూకంపాలు వస్తాయని, ఒక వేళ అక్కడ భూకంపం సంభవిస్తే దాని ప్రభావం 200 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుందని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement