ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు | The temple land encroachment removal | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు

Aug 23 2015 1:13 PM | Updated on Sep 3 2017 8:00 AM

దేవుడి భూములను ఆక్రమించుకున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు.

పార్వతీపురం: దేవుడి భూములను ఆక్రమించుకున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్న ఆలయ భూములను కొంత మంది ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. దేవాదాయ శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఆదివారం ఆలయ ప్రాంగణానికి చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement