రాజానగరం మండలం కానవరం గ్రామసమీపంలోని చెట్లపొదల్లో మంగళవారం ఉదయం ఓ ఆడశిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్లింది.
రాజానగరం మండలం కానవరం గ్రామసమీపంలోని చెట్లపొదల్లో మంగళవారం ఉదయం ఓ ఆడశిశువును గుర్తుతెలియని మహిళ వదిలేసి వెళ్లింది. శిశువు బొడ్డుతాడు కూడా కట్ చేయకుండా పడవేసినట్లు తెలిసింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ఈ విషయాన్ని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పసికందును ఐసీడీఎస్ అధికారులు కాకినాడలోని శిశుసంక్షేమ కార్యాలయానికి తరలించారు.