మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ | The families of the victims of YS Jagan paramarsa | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ

Jan 7 2015 10:11 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతపురం: మావటూరులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, మృతుల కుటుంబ సభ్యులను  పరామర్శించారు. మృతులు నర్సింహులు , గంగాధర్, అనిల్‌కుమార్, నరేంద్ర, అశోక్, భాస్కర్ , హన్మతరాయుడు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. 

ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలలో  ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement