అనుమానం పెనుభూతమై.. | The brutal murder in West Godavari district | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Apr 10 2016 9:02 AM | Updated on Sep 3 2017 9:38 PM

అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు.

అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి ఆరేళ్ల క్రితం రోజ(21)తో వివాహమైంది. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరి జీవితంలోకి తరచు గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి కోపోద్రిక్తుడై ఆమె నిద్రిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున కొబ్బరి కాయలు నరికే కత్తితో ఆమె మెడ నరికేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement