యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ వీసీ బంగ్లా ఎదుట మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ‘డీ’ మెస్కు చెందిన ‘ఈ’ బ్లాక్ విద్యార్థులు వీసీ బంగ్లా వద్దకు వచ్చి బైఠాయించారు. పాచిపోయిన భోజనం ప్లేట్లో తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. పాచిపోయిన భోజనం పెట్టారంటూ విద్యార్థులు ఆరోపించారు. మంగళవారం ఉదయం వండిన ఆహారాన్ని రాత్రి పెట్టడంతో ఆ భోజనం చెడిపోయి దుర్వాసన వస్తోందని విద్యార్థులు చెప్పారు. పాచిపోయిన భోజనాన్ని మీడియాకు చూపించారు. హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే అధికారులు విద్యార్థులకు సరైన భోజనం పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వార్డెన్ చలపతి వీసీ బంగ్లా వద్దకు వచ్చారు. దీంతో అగ్రహించిన విద్యార్థులు ఈ పాచిపోయిన భోజనాన్ని మీరు తిని చూపించాలని కోరారు. ఆ భోజనం తనకు వద్దని వార్డెన్ అనడంతో విద్యార్థులు ఆగ్రహించారు. మాకు మాత్రం పాచిపోయిన భోజనం పెడతారు. మీరు ఎందుకు తినరని ప్రశ్నించారు. వార్డెన్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. అనంతరం రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు ‘ఈ’ బ్లాక్ను సందర్శించారు. భోజనాన్ని పరిశీలించారు. భోజనం పాచిపోయిందని నిర్ధారించి, మళ్లీ భోజనం వండించారు. రాత్రి పదకొండు గంటల వరకూ వరకు అక్కడే ఉండి అన్నం వడ్డించాకే వెళ్లారు.
పాచిన అన్నం మీరు తింటారా?
Published Wed, Aug 6 2014 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement