ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య | Student commits suicide | Sakshi
Sakshi News home page

ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

Nov 5 2015 6:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

వెలిగొండ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు  పాల్పడిన ఘటన వెలిగొండ మండలం నర్సాయిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి  చెందిన బాల వినోద్(24) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఒత్తిడి తట్టుకోలేక గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement