విశాఖ చేరుకున్న సీసీఐ బస్సు యాత్ర
నేతలకు ఘన స్వాగతం
బహిరంగ సభలో {పభుత్వాల తీరుపై నిప్పులు చెరిగిన నాయకులు
విశాఖపట్నం : రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం నుంచి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళంలో మొదలైన బస్సుయాత్ర ఆదివారం విశాఖకు చేరుకుంది. ప్రత్యేక హోదాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విశాఖను విద్య, పారిశ్రామికపరంగా అభివృద్ధి చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు సీపీఐ నేతలు ఉంచారు. విశాఖ చేరుకున్న నేతలకు పార్టీ నగర కార్యదర్శి డి.మార్కండేయులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలు సంఘాలు నేతలను సన్మానాలతో ముంచెత్తారు. పది రూపాయల నోట్లతో చేసిన దండలు వేశారు. ఈ సందర్భంగా జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నాయకులు ఆవేశపూరితంగా ప్రసంగించారు.
ప్రత్యేక హోదా తీసుకురాకపోతే 11వ తేదీన జగిగే బంద్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. రూ.23వేల కోట్లు ప్యాకేజీ అడిగితే జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటే మన ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. విశాఖ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబు చెబుతున్న మాటలకు, కేంద్ర మంత్రులు చెబుతున్న వాటికి పొంతన ఉండటం లేదని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్చేశారు. హోదా కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు కేంద్రమే నిర్మించాల్సి ఉండగా సింగపూర్ దగ్గర దేవులాడటం ఎందుకని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ బదులు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ఇవ్వాలన్నారు. చంద్రబాబు రైతు సమస్యలు పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యార్ధి జేఏసీ చైర్మన్ లగుడు గోవిందరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంధ్రనాధ్, బెటర్ విశాఖ ఫోరం అధ్యక్షుడు సీఎస్రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, టీచర్స్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు, రాష్ర్ట మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరిముల్ల, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, ఏఐవైఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎన్.సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ మత్సకార కార్మిక సంఘం నాయకుడు వై. నందన్న, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హోదా కోసం సమర శంఖం
Published Mon, Aug 3 2015 12:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement