'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి' | srirama navavami celebrations must be in ramateertham | Sakshi
Sakshi News home page

'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'

Feb 28 2015 5:59 PM | Updated on Sep 2 2017 10:05 PM

'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'

'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు.

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీ దుర్గా థియోటర్ నుంచి రామతీర్థం వరకు కొనసాగింది. రామతీర్థంలోనే ఉత్సవాలు నిర్వహించాలని ర్యాలీ నిర్వాహకులు  నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు రామతీర్థం సరైనదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా... శ్రీరామనవమి ఉత్సవాలను వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
(నెల్లిమర్ల)





 

Advertisement
 
Advertisement
Advertisement