‘ఓటర్లుగా నమోదు కండి’ | Since the beginning of the process today | Sakshi
Sakshi News home page

‘ఓటర్లుగా నమోదు కండి’

Nov 17 2016 1:27 AM | Updated on Sep 17 2018 6:08 PM

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.

నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం
 
 సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఉభయ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల ముసారుుదా జాబితాలను బుధవారం ప్రకటించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ జాబితాల్లో పేర్లు లేనివారితో పాటు వచ్చేఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు గురువారం నుంచి ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చేనెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుందని ఆయన తెలిపారు.ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చునన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఓఆంధ్రా.ఎన్‌ఐసీ.ఇన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement