రేపటి నుంచి శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష | Shobha Nagi Reddy 48-hour hunger strike from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష

Oct 1 2013 1:55 AM | Updated on May 25 2018 9:10 PM

రేపటి నుంచి శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష - Sakshi

రేపటి నుంచి శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష

సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 48 గంటల నిరాహారదీక్ష చేపడుతున్నట్లు శోభా నాగిరెడ్డి తెలిపారు.

ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రనే కొనసాగించాలని  డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 48 గంటల నిరాహారదీక్ష చేపడుతున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని హేళన చేసి మాట్లాడడం కేసీఆర్‌కు తగదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement