'ఎన్నికల కోసమే కేంద్రమంత్రుల రాజీనామా డ్రామాలు' | Seemandhra central ministers plays political dramas, Deputy Chief Minister Damodar Rajanarasimha | Sakshi
Sakshi News home page

'ఎన్నికల కోసమే కేంద్రమంత్రుల రాజీనామా డ్రామాలు'

Oct 8 2013 1:21 PM | Updated on Sep 27 2018 8:33 PM

వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజకీయ డ్రామాలు అడుతున్నారని డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజకీయ డ్రామాలు అడుతున్నారని డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ ఆరోపించారు. మంగళవారం న్యూఢిల్లీలో రాజనర్సింహ విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం గతంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉందని గుర్తు చేశారు.

 

ఆ విషయాన్ని రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నారని, ఆయన ఆ విషయాన్ని గుర్తుంచుకుని మసులుకుంటే మంచిదని డిప్యూటీ సీఎం రాజ నర్సింహ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement