సింహాచలం ఘాట్రోడ్డులో ప్రమాదం, గార్డుకు గాయాలు | Security guard injured in simhachalam ghat road | Sakshi
Sakshi News home page

సింహాచలం ఘాట్రోడ్డులో ప్రమాదం, గార్డుకు గాయాలు

Nov 3 2014 8:11 AM | Updated on Sep 2 2017 3:49 PM

విశాఖ జిల్లా సింహాచలం ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

విశాఖ : విశాఖ జిల్లా సింహాచలం ఘాట్రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవస్థానం బస్సు అదుపు తప్పి టోల్గేట్ వద్ద సెక్యూరిటీ గార్డును ఢీకొంది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సును ఓ ప్రయివేట్ వ్యక్తి నడిపినట్లు సమాచారం.

దీనిపై సింహాచలం ఈవో స్పందిస్తూ దేవస్థానం బస్సును ప్రయివేట్ వ్యక్తి నడిపినట్లు అంగీకరించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్తో పాటు దేవస్థానం ఉద్యోగి వెంకటేశంను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement