సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : భాష, యాస, శైలితో జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అనంతరం తెర పైకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్నాయుడును చూసి అంతా వారసుడొచ్చాడనుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ఆదరించారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలిపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరి ణామాలు మాత్రం అసలు వారసుడి వన్నె తగ్గిస్తున్నాయి. ఎర్రన్న కుటుంబ సభ్యులన్న సానుభూతితో ఎంపీగా రామ్మోహన్, టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గెలిచారు. ఎన్నికల వరకు టీడీపీ వ్యవహారమంతా రామ్మోహన్ కేంద్రంగానే సాగింది. ఆయనే తమ గెలుపు చుక్కాని అని మెజారిటీ అభ్యర్థులు, పార్టీ నాయకులు భావించారు. ఎన్నికల్లో విజయం సాధించి అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఎన్నికల వరకు ఉన్న సీన్ కాస్త రివర్స్ అయ్యింది. అధికార కేంద్రం అబ్బాయ్ నుంచి బాబాయ్కి బదిలీ అయినట్లు కనిపిస్తోంది. అధికారుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు సహజంగానే మంత్రి అచ్చెన్న చుట్టూ కేంద్రీకృతమవుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి.
సమీక్షలో రామ్మోహన్ మౌనం
జిల్లా అధికారులతో మూడు రోజుల క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో ఆద్యంతం అచ్చెన్న హవాయే కనిపించింది. ఎంపీగా రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరైనా మౌనంగా కూర్చుండిపోయారు. అచ్చెన్న ప్రభ వెలిగించేందుకు అంతా ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగింది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీలో ప్రమాణం చేయకముందే జిల్లా సమీక్ష నిర్వహించడం.. సమీక్ష నిర్వహణ తేదీలు మారడం వెనుక కూడా అచ్చెన్న వ్యూహం ఉందని పార్టీకి చెందిన కొందరు పేర్కొంటున్నారు. సమావేశంలో కూడా ఒక వర్గాన్నే టార్గెట్ చేసుకుని మంత్రి మాట్లాడటం కూడా అనుమానాలు రేపుతోంది. తన ప్రసంగాల ద్వారా జాతీయ స్థాయి నాయకుల్ని ఆకట్టుకున్న రామ్మోహన్ ఈ సమావేశంలో మాత్రం మౌనం దాల్చడం, ఓ ఎంపీగా జిల్లా వాసులకు తాను ఏం చేయదలచుకున్నానో సమీక్ష సమావేశంలో అధికారులకు చెప్పకపోవడంపై టీడీపీలోని ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది.
గ్రీవెన్స్లోనూ అదే తీరు
సహజంగా అధికారులు మంత్రికే ప్రాధాన్యం ఇస్తారు కదా అని సరిపెట్టుకుందామంటే.. ఈ నేతల ఇళ్ల వద్ద నిర్వహిస్తున్న రోజువారీ గ్రీవెన్సులోనూ అదే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీని పెద్దగా పట్టించుకోకుండా అందరూ అచ్చెన్న చెంతకు చేరుతుండటం చర్చనీయాంశమవుతోంది. పదేళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడం, త్వరలో నామినేటెడ్ సహా అనేక పదవులకు నియామకాలు జరగనున్న నేపథ్యంలో మంత్రిని మచ్చిక చేసుకుంటేనే పదవులు లభిస్తాయని భావిస్తున్న వారు ఆయన్ను కలిసి విన్నపాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై అచ్చెన్న జిల్లా కలెక్టర్పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పనులకు సంబంధించి కూడా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్న వ్యవహార శైలి తెలిసిన తన వారంతా తనను వదిలి ఆయన చుట్టూ తిరుగుతుండడం అబ్బాయ్ రామ్మోహన్కు ఇబ్బంది కలిగిస్తోందని ప్రచారం జరుగుతోంది.
జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి
ఇక జిల్లా కేంద్రంలో పార్టీ క్యాడర్ గతంలో రెండు వర్గాలుగా ఉండేంది. ఇప్పుడు అందరూ అచ్చెన్న వద్దకు క్యూ కడుతున్నారు. అటు ఎంపీ వద్దకు గానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే వద్దకు గానీ ఎవరూ వెళ్లకపోవడం గమనార్హం. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టు విచారణలో ఉన్నందున నిలిచిపోయిన శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా సంబంధిత మున్సిపాలిటీ ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే.. ఆ ఎమ్మెల్యే, ఎంపీలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తారు. అందుకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎంపీ, ఎమ్మెల్యేలను మంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారు కూడా మిగతా ప్రయత్నాలను పక్కన పెట్టి ప్రాపకం కోసం ఆరాటపడు తున్నారు.
టీడీపీలో సీన్ రివర్స్
Published Wed, Jun 18 2014 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement