బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం

బాలల చిత్రోత్సవంలో గవర్నర్ ఎదుట సమైక్యాంధ్ర నినాదం - Sakshi

18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో గవర్నరు నరసింహన్ ప్రసంగిస్తున్న సందర్భంగా సభలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొన్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకుని గట్టిగా నినాదాలు చేశారు. దీంతోస్వల్ప గందరగోళం ఏర్పడింది. సమైక్యాంధ్ర నినాదాలు చేసిన వ్యక్తిని  పోలీసులు పట్టుకుని లాక్కెళ్లారు. పోలీసులు లాక్కెళుతున్నా ఆ వ్యక్తి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్.. సేవ్ ఇండియా.. సేవ్ యునైట్ ఆంధ్రప్రదేశ్ ..’ అంటూ  బిగ్గరగా అరుస్తూ వెళ్లారు.  

 

హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top