లారీ ఢీకొని సాక్షి టీవీ సిబ్బందికి గాయాలు | sakshi tv Staff injuries in road accidents | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని సాక్షి టీవీ సిబ్బందికి గాయాలు

Jun 29 2014 2:37 AM | Updated on Aug 30 2018 3:58 PM

లారీ ఢీకొని సాక్షి టీవీ సిబ్బందికి గాయాలు - Sakshi

లారీ ఢీకొని సాక్షి టీవీ సిబ్బందికి గాయాలు

జేఆర్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రణస్థలం ఎస్‌బీఐ ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ సిబ్బంది ముగ్గురు గాయపడ్డారు.

రణస్థలం: జేఆర్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రణస్థలం ఎస్‌బీఐ ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ సిబ్బంది ముగ్గురు గాయపడ్డారు. సాక్షి మినీ వ్యాన్ విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వస్తోంది. రణస్థలం మండల కేంద్రంలో వ్యాను నిలుపు చేస్తుం డగా వెనుకే వస్తున్న లారీ పక్కనుంచి వెళు తూ డ్రైవర్ సీటు వద్ద ఢీకొట్టిందని మినీ వ్యా న్ డ్రైవర్ శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్‌ఐ లెంక సన్యాసినాయుడు తెలిపారు.
 
  ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసరావు, కెమెరామన్ రాజుకు స్వల్ప గాయాలవ్వగా రమణబాబుకు కుడిచేయి విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐ లెంక సన్యాసినాయుడు, హెచ్‌సీ కె.అడివన్న సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement