జిల్లాలో ఇటీవల తాళం వేసిన ఇళ్లలో చోరీలు పెరిగిపోయాయి. పెళ్లికో.. పండుక్కో ఇంటికి తాళం వేసి ఊరికెళ్లాలంటే జనం భయపడుతున్నారు.
జిల్లాలో ఇటీవల తాళం వేసిన ఇళ్లలో చోరీలు పెరిగిపోయాయి. పెళ్లికో.. పండుక్కో ఇంటికి తాళం వేసి ఊరికెళ్లాలంటే జనం భయపడుతున్నారు.
తిరుపతి క్రైం: - పలమనేరులో రెండు రోజుల కిందట తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడు సుబ్రమణ్యం ఇంటిలో అర కిలో బంగారు, నాలుగు కిలోల వెండి, రెండు లక్షల నగదు చోరీకి గురయ్యాయి. పిచ్చాటూరులో ఒకే రోజు మూడు ఇళ్లల్లో ఒకే ముఠా చోరీకి పాల్పడింది. పది సవరాలు బంగారు అపహరించారు.
భార్యాభర్తలు వ్యాపార పనుల నిమిత్తం వెళ్లడంతో తుమ్మలగుంట సమీపంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి భారీగా నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు.
జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట దొంగతనం జరుగుతూనే ఉంది. దొంగతనాలను అరికట్టడంలో పో లీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేరాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి నేరస్తులను పట్టుకోవాల్సిన ఐడీ పార్టీ తీరు ప్రశ్నార్థకంగా మారింది. క్లూస్టీమ్, సీసీఎస్ విభాగాలు ఉన్నా చోరీలు ఆగడం లేదు. రాత్రి సమయంలో పెట్రోలింగ్లో పోలీసుల నిర్లక్ష్యంతో దొంగతనాలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ముఠాలపై లోపించిన నిఘా
ప్రధాన నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో చైన్స్నాచింగ్లు, దొంగతనాల నిందితులను గుర్తిస్తున్నారు. నగర శివారు ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక నిఘా విఫలమవుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో గతంలో దృష్టి మరలించి చోరీలకు పాల్పడే నెల్లూరు జిల్లా బిట్రగుంట ముఠాలు, తమిళనాడు రాంజీముఠాలతో పాటు పాత నేరస్తులపై పోలీసుల దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వా హనాల చోరీకి గురై ఏళ్లు గడుస్తున్నా ఫిర్యాదుదారులకు తిరిగి వాహనం దొరి కిన దాఖలాలు లేకుండా పోతున్నాయి.
ప్రజల అజాగ్రత్త..
వరుస చోరీలకు ప్రజలు అజాగ్రత్త కూడా ఓ కారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు విలువైన వస్తువులు, ఆభరణా లు ఉంచొద్దని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రజలు ఇవేవీ పట్టించుకోకుం డా అజాగ్రత్తతో వ్యవహరించడంతో దొంగతనాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని పోలీసుల నుంచి వ్యక్తమవుతోంది. పోలీసులు, ఇంటి పక్కవారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తాళం వేసి వెళ్లిపోతుండడంతో దొం గలు పని సులువవుతోంది. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం
దొంగతనాలు, చైన్స్నాచింగ్లు, ద్విచక్రవాహనాల చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాం. నిందితులను పట్టుకోవడానికి నిఘా పార్టీలను కూడా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. ఊర్లకు వెళ్లినప్పుడు నమ్మకం ఉన్న పక్కన వారికి చెబితే మంచిది. ద్విచక్రవాహనాలకు ముందు చక్రానికి లాక్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. మహిళలు ఒంటరిగా వెళ్లేటప్పుడు మెడలో బంగారు నగలు లేకుండా చూసుకోవాలి. నగర శివారులోని ప్రజలు నగలు, నగదును సాధ్యమైనంత వరకు బ్యాంకు లాకర్లలో ఉంచుకోవడం మంచిది .
- సుబ్బారెడ్డి అర్బన్ జిల్లా క్రైం ఏఎస్పీ