బాలింత మృతితో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన | Relatives agitation infront of peddapuram government hospital due to Maternal death | Sakshi
Sakshi News home page

బాలింత మృతితో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

Mar 21 2014 11:03 AM | Updated on Sep 2 2017 5:00 AM

బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఓ గర్బిణి మృతి చెందిన సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఓ బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.  బాలింత మృతితో ఆమె బంధువులు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందిందని వారు ఆరోపించారు.

 

ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement