‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి సెప్టెంబర్ 4 వరకూ రిజిస్ట్రేషన్లు | registrations for sakshi india spell bee upto 4th september | Sakshi
Sakshi News home page

‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి సెప్టెంబర్ 4 వరకూ రిజిస్ట్రేషన్లు

Aug 3 2014 12:57 AM | Updated on Sep 2 2017 11:17 AM

‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి సెప్టెంబర్ 4 వరకూ రిజిస్ట్రేషన్లు

‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి సెప్టెంబర్ 4 వరకూ రిజిస్ట్రేషన్లు

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు సెప్టెంబర్ 4వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు సెప్టెంబర్ 4వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పదాల స్పెల్లింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే ఈ పోటీలకు శుక్రవారమే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఠీఠీఠీ.జీఛీజ్చీటఞ్ఛఛ్ఛ్ఛ.జీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 9505551099, 9705199924, 040-23322330/ 23256134 నంబర్లలో సంప్రదించవచ్చు. ఒక్కో విద్యార్థి రూ. 250 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలు, వ్యాకరణంతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను కూడా అందజేస్తారు.

నాలుగు దశలుగా నాలుగు కేటగిరీల్లో జరిగే ఈ పోటీలు... మొదటి మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. నాలుగో దశ అయిన ఫైనల్స్‌ను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఫైనల్ విజేతలకు ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా.. మొదటి బహుమతి కింద బంగారు పతకం, రూ. 25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ. 15 వేల నగదు.. మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ. 10 వేల నగదు అందజేస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement